Notice: file_put_contents(): Write of 1774 bytes failed with errno=28 No space left on device in /var/www/tgoop/post.php on line 50

Warning: file_put_contents(): Only 12288 of 14062 bytes written, possibly out of free disk space in /var/www/tgoop/post.php on line 50
Devotional Telugu@devotional P.1015
DEVOTIONAL Telegram 1015
స్వార్థం దుఃఖహేతువు

మనుషులలో అత్యధికులు స్వార్ధపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్ధమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అను భవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థపరులు తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్ధిస్తారు. నాకిది, నీకిది అంటూ భగవంతుడికే తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు. ఒక కోరిక తరువాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ అంతులేని కోరికలతో సతమతమవుతుంటారు.

స్వార్ధం మనిషి ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. మానవత్వాన్ని మంటగలుపు తుంది. స్వార్థపరత్వం మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎదుటివారి పతనాన్ని కోరు కుంటుంది. స్వార్థపరుడు లోభిగా మారతాడు. లోభం మనసులో ఆశలు రేపుతుంది. దురాశ ధర్మవిరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది.

పాండవులకు అయిదు ఊళ్లయినా ఇవ్వజూపని దుర్యోధనుడి స్వార్థం కౌరవ వంశ నాశనానికి దారితీసింది. తన కుమారుడికే రాజ్యాభిషేకం చేయాలన్న కైకమ్మ స్వార్థపరత్వం దశరథుడి ప్రాణాలు తీసింది. తన స్వార్థం కోసం ఇతరులను బాధించాలనుకోవడం వినాశకరం.

శ్రీ రామానుజులవారు గురువుగారి నుంచి మంత్రోపదేశం పొందారు. మంత్రార్థాన్ని తన ఊరి వారందరికీ బోధించారు. గురువుగారు కోపగించారు. వాగ్దాన భంగం చేసి నందుకు తానొక్కడినే నరకానికి వెడతానని, ఎంతోమంది భక్తులు ముక్తిమార్గంలో పర మాత్ముడిని చేరుకోగలిగితే కలిగే ఆనందం నరకం కన్నా మిన్న అన్న శ్రీ రామానుజుల వారు పూజనీయులయ్యారు. నిస్వార్థ భావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

దానం సర్వశ్రేష్ఠమైనదని, న్యాయార్జిత విత్తాన్ని పాత్రుడికి దానం చేస్తే పరలోకంలో ఉన్నతమైన ఫలం లభిస్తుందని అరణ్యవాస సమయంలో వ్యాసమహర్షి ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది. పాండవుల మహాప్రస్థానంలో ఒక కుక్క వారిని అనుసరించింది. సోదరులు పడిపోగా, ధర్మరాజును కుక్క దారిలో ద్రౌపది, చివరి వరకూ అనుసరించింది. ఇంద్రుడు రథంపై వచ్చి సశరీరంగా ధర్మరాజును స్వర్గానికి తీసుకు వెళతానం టాడు. ధర్మరాజు తనను అప్పటిదాకా అనుసరించిన కుక్కకు కూడా స్వర్గప్రాప్తి కలి గించమంటాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోతే ధర్మరాజు తానూ స్వర్గానికి రాలేనంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుణ్ని కొనియాడుతూ- ఒక కుక్క కోసం ఇంద్రుడి రథాన్ని కూడా పరిత్యజించిన ధర్మరాజుకు సమానులెవరూ స్వర్గంలో లేరని అంటాడు. అలా ధర్మరాజు

పరమోత్కృష్టమైన దివ్యగతిని పొంది సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు. నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి. నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల ప్రయోజనాలు విస్మరించి అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం దుఃఖానికి హేతువవుతుంది. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనంత భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని భగవానుడి గీతోపదేశం. భగవంతుడు మనిషికి సేవ చేసే శక్తిని, బుద్ధిని ప్రసాదించాడు. నిస్వార్థంగా సేవచేసే వారికి భగవంతుడి అండ లభిస్తుందనడంలో సందేహం లేదు.

మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు జ్ఞానవంతుడు. జ్ఞానానికి వివేకం తోడైతే మనిషి రాణిస్తాడు. మంచిచెడుల విచక్షణ తెలుసుకుని స్వార్థాన్ని కట్టడి చేయగలవాడే ఉత్తముడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిఢవిల్లుతాయి. నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది.



tgoop.com/devotional/1015
Create:
Last Update:

స్వార్థం దుఃఖహేతువు

మనుషులలో అత్యధికులు స్వార్ధపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్ధమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అను భవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థపరులు తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్ధిస్తారు. నాకిది, నీకిది అంటూ భగవంతుడికే తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు. ఒక కోరిక తరువాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ అంతులేని కోరికలతో సతమతమవుతుంటారు.

స్వార్ధం మనిషి ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. మానవత్వాన్ని మంటగలుపు తుంది. స్వార్థపరత్వం మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎదుటివారి పతనాన్ని కోరు కుంటుంది. స్వార్థపరుడు లోభిగా మారతాడు. లోభం మనసులో ఆశలు రేపుతుంది. దురాశ ధర్మవిరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది.

పాండవులకు అయిదు ఊళ్లయినా ఇవ్వజూపని దుర్యోధనుడి స్వార్థం కౌరవ వంశ నాశనానికి దారితీసింది. తన కుమారుడికే రాజ్యాభిషేకం చేయాలన్న కైకమ్మ స్వార్థపరత్వం దశరథుడి ప్రాణాలు తీసింది. తన స్వార్థం కోసం ఇతరులను బాధించాలనుకోవడం వినాశకరం.

శ్రీ రామానుజులవారు గురువుగారి నుంచి మంత్రోపదేశం పొందారు. మంత్రార్థాన్ని తన ఊరి వారందరికీ బోధించారు. గురువుగారు కోపగించారు. వాగ్దాన భంగం చేసి నందుకు తానొక్కడినే నరకానికి వెడతానని, ఎంతోమంది భక్తులు ముక్తిమార్గంలో పర మాత్ముడిని చేరుకోగలిగితే కలిగే ఆనందం నరకం కన్నా మిన్న అన్న శ్రీ రామానుజుల వారు పూజనీయులయ్యారు. నిస్వార్థ భావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

దానం సర్వశ్రేష్ఠమైనదని, న్యాయార్జిత విత్తాన్ని పాత్రుడికి దానం చేస్తే పరలోకంలో ఉన్నతమైన ఫలం లభిస్తుందని అరణ్యవాస సమయంలో వ్యాసమహర్షి ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది. పాండవుల మహాప్రస్థానంలో ఒక కుక్క వారిని అనుసరించింది. సోదరులు పడిపోగా, ధర్మరాజును కుక్క దారిలో ద్రౌపది, చివరి వరకూ అనుసరించింది. ఇంద్రుడు రథంపై వచ్చి సశరీరంగా ధర్మరాజును స్వర్గానికి తీసుకు వెళతానం టాడు. ధర్మరాజు తనను అప్పటిదాకా అనుసరించిన కుక్కకు కూడా స్వర్గప్రాప్తి కలి గించమంటాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోతే ధర్మరాజు తానూ స్వర్గానికి రాలేనంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుణ్ని కొనియాడుతూ- ఒక కుక్క కోసం ఇంద్రుడి రథాన్ని కూడా పరిత్యజించిన ధర్మరాజుకు సమానులెవరూ స్వర్గంలో లేరని అంటాడు. అలా ధర్మరాజు

పరమోత్కృష్టమైన దివ్యగతిని పొంది సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు. నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి. నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల ప్రయోజనాలు విస్మరించి అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం దుఃఖానికి హేతువవుతుంది. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనంత భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని భగవానుడి గీతోపదేశం. భగవంతుడు మనిషికి సేవ చేసే శక్తిని, బుద్ధిని ప్రసాదించాడు. నిస్వార్థంగా సేవచేసే వారికి భగవంతుడి అండ లభిస్తుందనడంలో సందేహం లేదు.

మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు జ్ఞానవంతుడు. జ్ఞానానికి వివేకం తోడైతే మనిషి రాణిస్తాడు. మంచిచెడుల విచక్షణ తెలుసుకుని స్వార్థాన్ని కట్టడి చేయగలవాడే ఉత్తముడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిఢవిల్లుతాయి. నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది.

BY Devotional Telugu


Share with your friend now:
tgoop.com/devotional/1015

View MORE
Open in Telegram


Telegram News

Date: |

The group also hosted discussions on committing arson, Judge Hui said, including setting roadblocks on fire, hurling petrol bombs at police stations and teaching people to make such weapons. The conversation linked to arson went on for two to three months, Hui said. How to Create a Private or Public Channel on Telegram? How to create a business channel on Telegram? (Tutorial) “Hey degen, are you stressed? Just let it all out,” he wrote, along with a link to join the group. Co-founder of NFT renting protocol Rentable World emiliano.eth shared the group Tuesday morning on Twitter, calling out the "degenerate" community, or crypto obsessives that engage in high-risk trading.
from us


Telegram Devotional Telugu
FROM American