DEVOTIONAL Telegram 1092
ఊరొక్కటే- దారులెన్నో....

ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది.

ఎవరికైనా లక్ష్యం ఒక్కటే దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.

నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి,
జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను
చేరుకోదగిన విధానాలే! 'మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది' అంటారు ఆదిశంకరులు. తల్లికోతి
ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే
మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి.

అప్పుడు మన రక్షణ అంతా ఆయనే
చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు
అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. 'మానవసేవే మాధవసేవ' అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య 'బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. 'తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు' అని రామదాసు అన్నా... 'బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!' అని త్యాగయ్య కీర్తించినా... 'మీ రాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్దుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు. మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా.... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి
ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!



tgoop.com/devotional/1092
Create:
Last Update:

ఊరొక్కటే- దారులెన్నో....

ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది.

ఎవరికైనా లక్ష్యం ఒక్కటే దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.

నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి,
జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను
చేరుకోదగిన విధానాలే! 'మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది' అంటారు ఆదిశంకరులు. తల్లికోతి
ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే
మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి.

అప్పుడు మన రక్షణ అంతా ఆయనే
చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు
అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. 'మానవసేవే మాధవసేవ' అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య 'బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. 'తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు' అని రామదాసు అన్నా... 'బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!' అని త్యాగయ్య కీర్తించినా... 'మీ రాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్దుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు. మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా.... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి
ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!

BY Devotional Telugu


Share with your friend now:
tgoop.com/devotional/1092

View MORE
Open in Telegram


Telegram News

Date: |

The Channel name and bio must be no more than 255 characters long Ng Man-ho, a 27-year-old computer technician, was convicted last month of seven counts of incitement charges after he made use of the 100,000-member Chinese-language channel that he runs and manages to post "seditious messages," which had been shut down since August 2020. During a meeting with the president of the Supreme Electoral Court (TSE) on June 6, Telegram's Vice President Ilya Perekopsky announced the initiatives. According to the executive, Brazil is the first country in the world where Telegram is introducing the features, which could be expanded to other countries facing threats to democracy through the dissemination of false content. The public channel had more than 109,000 subscribers, Judge Hui said. Ng had the power to remove or amend the messages in the channel, but he “allowed them to exist.” Ng was convicted in April for conspiracy to incite a riot, public nuisance, arson, criminal damage, manufacturing of explosives, administering poison and wounding with intent to do grievous bodily harm between October 2019 and June 2020.
from us


Telegram Devotional Telugu
FROM American